ప్రాణం తీసిన చేపల వేట

చేపల వేట కోసం నీటిలో దిగిన యువకుడు వల చుట్టు కోవడంతో ఊపిరాడక నీట మునిగి మృతి చెందిన సంఘటన లింగంపేట్ మండలం సురాయిపల్లి తండాలో జరిగింది.

Update: 2024-03-12 16:12 GMT

దిశ, లింగంపేట్ : చేపల వేట కోసం నీటిలో దిగిన యువకుడు వల చుట్టు కోవడంతో ఊపిరాడక నీట మునిగి మృతి చెందిన సంఘటన లింగంపేట్ మండలం సురాయిపల్లి తండాలో జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సురాయిపల్లి తండాకు చెందిన రవీందర్ మంగళవారం తండా శివారులోని ఒంటరి కుంటలో చేపలు పట్టడానికి దిగాడు.

     చేపల కోసం వల వేస్తున్న సమయంలో వల కాళ్లకు చుట్టు కోవడంతో నీట మునిగి ఊపిరి ఆడక చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. రవీందర్ నీట మునిగిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బయటకు తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.


Similar News