ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు చెల్లించాల్సిన రూ. 8300 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను చెల్లించకుండా పెండింగులో ఉంచటం సిగ్గు చేటని, వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-08-31 10:31 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు చెల్లించాల్సిన రూ. 8300 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను చెల్లించకుండా పెండింగులో ఉంచటం సిగ్గు చేటని, వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు శనివారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

    ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను చెల్లించక పోవటం వలన విద్యార్థులపైన అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. కాలేజీల్లో యూనివర్సిటీలలో కోర్సు పూర్తయినా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు చెల్లించే మెస్ చార్జీలు ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుకూలంగా పెంచాలన్నారు. ఇంచార్జీ వీసీ లతో యూనివర్సిటీలను నడపడం సరైంది కాదని, రెగ్యులర్ వీసీ లను నియమించాలని రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెయూ పీడీఎస్​యూ నాయకులు ప్రిన్స్, రవీందర్, గోపి, రాకేష్, బాలాజీ, భారత్, మణికంఠ, నితిన్, ధర్ము తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News