రైతులు యార్డ్ను సద్వినియోగం చేసుకోవాలి
కూరగాయలు పండించే రైతులు యార్డ్ను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల అన్నారు
దిశ, భిక్కనూరు: కూరగాయలు పండించే రైతులు యార్డ్ను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల అన్నారు. రూ. 15 లక్షల నాబార్డు, లక్షా 95 వేల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్ యార్డ్ను సోమవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన కూరగాయలను ఈ యార్డ్కు తెచ్చి విక్రయించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తామని, అందుకోసం అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డీజేఎం శ్రీనివాస్, డీడీఎం ప్రవీణ్ కుమార్, ఎస్పీడీఎస్ ఈడీ గంగాధర్ రావు, తాజా మాజీ సర్పంచ్ సత్తూరి లక్ష్మీ రాజలింగం, ఎంపీటీసీ సభ్యులు కోడూరి సాయ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాపనోళ్ల స్వామి, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.