విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలంలోని చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-01-08 09:05 GMT

దిశ, తాడ్వాయి: విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలంలోని చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం… చందాపూర్ గ్రామానికి చెందిన అల్లూరి నర్సారెడ్డి (39) మొక్కజొన్న పంటను కౌలుకు సాగు చేస్తున్నాడని తెలిపారు. రోజు మాదిరిగానే మొక్క జొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లగా చుట్టూ భూమి తడిగా ఉండటంతో ప్రమాదవశాత్తు కరెంటు వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Similar News