బీజేపీ గెలుపునకు అందరూ కలిసికట్టుగా పని చేయాలి

కేంద్ర ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపునకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి కోరారు.

Update: 2024-01-11 14:07 GMT

దిశ, కామారెడ్డి : కేంద్ర ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపునకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి కోరారు. పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కామారెడ్డిలో బీజేపీ కి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పని చేయాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. సమావేశంలో పార్లమెంటు ఇంచార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Similar News