ఎల్లారెడ్డి ప్రజలకు సేవకునిగా ఉంటా

కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే సురేందర్ బిచాన ఎత్తేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిండని కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ రావు అన్నారు.

Update: 2023-11-26 11:19 GMT

దిశ, తాడ్వాయి : కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే సురేందర్ బిచాన ఎత్తేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిండని కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తాడ్వాయి కేంద్రంలో ప్రచారాన్ని చేపట్టారు. దీంతో మండల ప్రజలు బ్రాహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందాలు వేసుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా జాజుల సురేందర్ ను గెలిపించుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలిశాడని అన్నారు. భూములు గుంజుకునే పార్టీ కావాలో భూములు ఇచ్చే పార్టీ కావాలో ప్రజలే తేల్చుకోవాలని కోరారు. గెలిచిన నెల రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎమ్మెల్యే హెల్ప్ సెంటర్ ను ప్రారంభిస్తానని ఆయన అన్నారు. తాను కరోనా కష్ట కాలంలో చావునోట్లో తలకాయ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నానని తెలిపారు. బీఆర్ఎస్ కి ఓటు వెయ్యకుంటే పెన్షన్ రాదని బయపెడుతున్నారని, పెన్షన్ ఆపే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. తాను గెలిస్తే ఒకే ఒక్క రూపాయి తీసుకొని సేవ చేస్తా అని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ధర్మారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.   


Similar News