కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-24 11:58 GMT

దిశ, ఆర్మూర్ : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో, మదీనా కాలనీ లో మైనారిటీలను కలిసి వారితో వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చ టించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీ ల సంక్షేమానికి ఎంతో కృషి చేసింది అని అన్నారు. మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య ను అందించడానికి మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నాయకులు మంత్రి వేముల సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి వేముల వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 


Similar News