మానవత్వాన్ని చాటుకున్న డీపీఓ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో అరుదైన మానవీయ కోణం కనిపించింది.

Update: 2024-07-08 13:44 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో అరుదైన మానవీయ కోణం కనిపించింది. జిల్లాకు చెందిన 75 సంవత్సరాలు దాటిన తిలక్ శర్మ అనే వృద్ధుడు ధరణి సమస్యపై నిజామాబాద్ లో సోమవారం జరుగుతున్న ప్రజావాణిలో అధికారులకు తమ సమస్య వివరించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించే అధికారులు స్టేజి మీద ఉండడంతో ఆ వృద్ధుడు కాలు నడవ రాకపోయినా మెల్లిగా నడుచుకుంటూ వినతిపత్రం అందిస్తున్న క్రమంలో కాలుజారి పడబోతుండగా జిల్లా పంచాయతీరాజ్ అధికారి తరుణ్ కుమార్ అతనిని గ్రహించి వెంటనే అతని దగ్గరికి వెళ్లి సమస్య ఏంటి అని తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


Similar News