హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు జనవరి 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని నవోదయ ప్రిన్సిపాల్ సత్యవతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు జనవరి 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని నవోదయ ప్రిన్సిపాల్ సత్యవతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను ఇంటర్నెట్లో novodaya.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ కాకపోతే నవోదయ విద్యాలయానికి వచ్చి తీసుకోవాలని ఆమె సూచించారు.