మాయ మాటలు వినకండి

ఓట్ల కోసం నాయకులు చెప్పే మోసపు మాటలు వినొద్దని, ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-21 09:22 GMT

దిశ,తిరుమలాయపాలెం : ఓట్ల కోసం నాయకులు చెప్పే మోసపు మాటలు వినొద్దని, ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుమలాయపాలెం మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అజ్మీరాతండాలో ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ...ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉండాలని, వార్​ వన్ సైడే కాబోతుంది అని అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బి.వీరన్న,నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, పాలేరు నియోజకవర్గ ఎన్నిక సమన్వయకర్త, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, జగదీష్, తదితరులు పాల్గొన్నారు. 


Similar News