అవిశ్వాసం నెగ్గింది… అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి

Update: 2024-07-09 15:13 GMT

దిశ, ఎల్లారెడ్డి: మే నెల 18వ తేదీన ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పై ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలోని 11 వార్డుల కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలో పత్రిక సమావేశం నిర్వహించి రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ మన్నే ప్రభాకర్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పదవీచ్యుతుడు అయినట్లు అధికారికంగా ఎటువంటి అధికారాలు ఉండవని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు.


Similar News