ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

రాష్ట్ర పౌర సరఫరాల,నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ని ఆర్మూర్ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.

Update: 2024-10-02 11:39 GMT

దిశ ఆర్మూర్ : రాష్ట్ర పౌర సరఫరాల,నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ని ఆర్మూర్ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఇటీవల మృతి చెందడంతో.. హైదరాబాద్ లోని కొండపూర్‌ లో మంత్రి ఇంటికి వెళ్లి పురుషోత్తం రెడ్డి చిత్రపటం వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తో పాటు అయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.


Similar News