పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి అరవింద్

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా ధర్మపురి అరవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం పార్లమెంట్ హౌస్ లో ధర్మపురి అరవింద్ చేత స్పీకర్ రాధా మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Update: 2024-06-25 15:38 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా ధర్మపురి అరవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం పార్లమెంట్ హౌస్ లో ధర్మపురి అరవింద్ చేత స్పీకర్ రాధా మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మపురి అరవింద్ రెండోసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తర్వాత ఎంపీగా ఇంగ్లీషులో ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంలో గ్యాలరీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత చూపుతామని ధర్మపురి అరవింద్ ప్రమాణం చేశారు.


Similar News