మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడంపై హర్షం

మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Update: 2024-03-13 10:02 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్నూరు కాపు కుల బంధువుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని నగర మాజీ మేయర్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆకుల సుజాత, రాష్ట్ర కార్యదర్శి లింగం అన్నారు. బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుల సుజాత మాట్లాడుతూ..

    మున్నూరు కాపుల ఆకాంక్ష ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, దీంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామం అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. కార్పొరేషన్ కు నిధులు ఇవ్వాలని కోరారు. 60 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపుల కార్పొరేషన్ కోసం 500 కోట్లు ప్రకటించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి లింగం మాట్లాడుతూ..

    దశాబ్ద కాలంగా కార్పొరేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవన్న అధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బాజిరెడ్డి జగన్, రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు ఆకుల లలిత తో పాటు రాష్ట్ర , జిల్లా కార్యవర్గం ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఆకుల శ్రీశైలం, ఎండల ప్రసాద్, చింతకాయల రాజు, కిషన్ రెడ్డి, భూపతి, నరేష్, ప్రవీణ్, మహేష్, భోజరాజు, కర్క రమేష్, జెట్టి గోవిందరాజ్, శ్రీకాంత్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News