మద్యం సేవించిన వ్యక్తి మృతి

మద్యం సేవించి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-09-04 06:42 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మద్యం(alcohol) సేవించి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్(Nizamabad) నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎఎస్ఐ మహేష్(Mahesh) తెలిపిన వివరాల ప్రకారం.. మాణిక్ బండార్ గ్రామానికి చెందిన జంగం ప్రభాకర్ (42) మంగళవారం రాత్రి నగరంలోని దుబ్బ ప్రాంతంలో గల ఎంవిఆర్ వైన్స్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్‌లో మద్యం సేవించాడు. అనంతరం వాంతులు చేసుకోవడం తో ఒక్కసారిగా ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. అక్కడే ఉన్న వాచ్‌మెన్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్(Nizamabad) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.


Similar News