నేరగాళ్లను, కేటుగాళ్లను తరిమికొట్టాలి

నేరగాళ్లను కేటుగాళ్లను ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో తరిమికొట్టాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-22 15:43 GMT

దిశ, ఆర్మూర్ : నేరగాళ్లను కేటుగాళ్లను ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో తరిమికొట్టాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, భావితరాల గురించి బాగా ఆలోచించి తనను ఆశీర్వదించి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బుధవారం రాత్రి ఆర్మూర్ నియోజకవర్గంలోని మక్లుర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీజేపీని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం చేశారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాలతో ప్రజలు మంగళ హారతులు పట్టారు. మహిళలు బోనాలతో, యువకులు బైక్ ర్యాలీలతో కేరింతలు కొడుతూ తమ అభిమాన నేతను ఘనంగా స్వాగతించారు.

     రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. మండల కేంద్రం అభివృద్ధి మాత్రం శూన్యం అని, ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా రోడ్లు ఉన్నాయి అని, జీవన్ రెడ్డి అభివృద్ధిలో తాను ఒక్కడే అభివృద్ధి చెందాడు అని అన్నారు. అభివృద్ధి పై చర్చకు మాక్లుర్ చౌరస్తా కి రావడానికి సిద్దం అన్నారు. తాను చెప్పే మాటలు అబద్ధం అని నిరూపిస్తే చావడానికి సిద్దం అని అన్నారు. మైనార్టీ మహిళలు కూడా ఆలోచన చేయాలి అని కోరారు. బీజేపీ వస్తే పేదలకు ఇండ్లు, ఆడపిల్ల పుడితే 2లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం అని, గర్భవతి అయితే 15 వేలు ఇస్తాం అని అన్నారు. ప్రతి గ్రామంలో ఇండ్ల నిర్మాణం ఏడాదిలో ప్రారంభించకపోతే పదవికి రాజీనామా చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సురేష్ నాయక్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు, గంగొనీ సంతోష్, ఎంపీటీసీ ఓడన్న, తదితరులు పాల్గొన్నారు.


Similar News