ఎల్లారెడ్డి అభివృద్ధికి 10 కోట్ల నిధులు.. హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు.

Update: 2024-01-16 07:30 GMT

దిశ, తాడ్వాయి: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ షౌకత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నెలరోజుల వ్యవధిలోని ఎమ్మెల్యే మదన్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని పలు మార్లు కలిసి ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. దీంతో రూ,10 కోట్ల నిధుల కేటాయించినందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.

అతి తక్కువ కాల వ్యవధిలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు అయ్యేందుకు కృషిచేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబీర్ శ్యామ్ రావు,గడ్డం వెంకట్రాంరెడ్డి, నర్సారెడ్డి, సాయిరెడ్డి, రాజేందర్ రావు, మెట్టు రాంచెంద్రం,రాజీవ్ కుమార్, అఖిల్ రావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News