మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన కలెక్టర్

నిజామాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు కు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

Update: 2024-10-21 11:33 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు కు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్ హౌస్ లో మంత్రితో పాటు..ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లతో కలెక్టర్, కమిషనర్ భేటీ అయ్యారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు మంత్రి జూపల్లి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రితో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.


Similar News