తాళం వేసిన ఇంట్లో చోరీ

మండల కేంద్రంలోని మహాజన్ బాలాజీ వ్యాపారవేత్త.

Update: 2024-03-27 09:36 GMT

దిశ, మద్నూర్ : మండల కేంద్రంలోని మహాజన్ బాలాజీ వ్యాపారవేత్త. ఈయన మంగళవారం సాయంత్రం సరుకులు కొనుక్కోవడానికి మార్కెట్లోకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులోని 25 తులాల బంగారం, 16 వేల నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బంగారం విలువ 13 లక్షల 15 వేలు, నగదు 16 వేలు, మొత్తం 13 లక్షల 31 వేలు ఉంటుందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Similar News