తాళం వేసిన ఇంట్లో చోరీ

కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో సోమవారం రాత్రి తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి రెండు తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు.

Update: 2024-01-16 13:00 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో సోమవారం రాత్రి తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి రెండు తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు. దేవునిపల్లి ఎస్సై రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక లచాపేట్ గ్రామానికి చెందిన గాజుల రాజ్ కుమార్ గురు రాఘవేంద్ర కాలనీలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు.

    సంక్రాంతి పండగకు అద్దె ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లాడు. పండగ అయిపోయాక మంగళవారం వచ్చి చూసేసరికి ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండగా ఇంట్లో చూడగా బీరువా పగులగొట్టి ఉంది. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితుడు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రాజు క్లూస్​ టీం ను రప్పించి దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


Similar News