బర్దిపూర్ లో గుప్త నిధుల కలకలం

బోధన్ మండలం బర్దిపూర్ గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి.

Update: 2024-01-13 09:27 GMT

దిశ,బోధన్ : బోధన్ మండలం బర్దిపూర్ గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. అనుమానాస్పదంగా తవ్వకాలు చేపట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాలు చేపట్టిన వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బర్దిపూర్ లో కిరాయికి ఉండే భోగిపి రాజు తన ఇంటి యజమాని మహేందర్ సూచనల మేరకు గుప్త నిధుల తవ్వకాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి మహారాజ్ సీతారామచారిని,

    తవ్వడానికి బోధన్ నుండి సాయిలు, వీరయ్యను రప్పించి శుక్రవారం అర్ధరాత్రి తవ్వకాలు నిర్వహించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారుల సమక్షంలో బైండోవర్ చేసినట్లు ఎస్సై నాగనాథ్ తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. 


Similar News