యువకుడి దారుణ హత్య... ఆనవాళ్లు దొరక్కుండా డెడ్ బాడీ కాల్చివేత

నిజామాబాద్ నగరంలో నగరంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2024-01-29 11:24 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో నగరంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడిని హత్య చేసిన అగంతకులు ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు డెడ్ బాడీని కాల్చివేశారు. నిజామాబాద్ నగర సీఐ నరహరి తెలిపిన కథనం ప్రకారం... నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ మేరీ స్కూల్ వెనుక పాడుబడిన ఇంట్లో గుర్తుతెలియని యువకుడిని హత్య చేసి దహనం చేశారని స్థానిక రెండవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు సంఘటన స్థలాన్ని నగర నరహరి, నిజామాబాద్ ఏసీపీ రాజశేఖర్ రాజులు పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గురైన యువకుడి వయస్సు 25 సంవత్సరాలు లోపు ఉంటుందని అంచనాకు వచ్చారు. స్థానికంగా సంఘటన స్థలంలో దొరికిన ఆనవాళ్ళ ప్రకారం యువకుడి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన స్థలానికి క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. యువకుడి హత్యకు గల కారణాలను వెతికే పనిలో పడ్డారు. స్థానికంగా కాలనీలో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


Similar News