ఆకలితో బాలుడు మృతి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలం చందు అనే ఐదు సంవత్సరాల చిన్నారి బాలుడు మూడు రోజులుగా అన్నం తినకపోవడంతో బుధవారం మృతి చెందాడు.

Update: 2023-11-22 15:34 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలం చందు అనే ఐదు సంవత్సరాల చిన్నారి బాలుడు మూడు రోజులుగా అన్నం తినకపోవడంతో బుధవారం మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు ఇటికబట్టిలో పనిచేస్తూ అక్కడే జీవనం ఉంటున్నారు. ఇటుక బట్టీలో పనిచేసుకుంటూ తినడానికి తిండి లేకపోవడంతో మూడు రోజులు అలాగే ఉన్న ఆ బాలుడు మృతి చెందాడు. మృతదేహాన్ని బాల్కొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి వద్ద బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి డబ్బులు లేకపోవడంతో బాల్కొండ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన చిన్నారిని ఎత్తుకొని అలాగే ఒంటరిగా ఉన్నాడు. 


Similar News