బీఆర్ఎస్ కు బిగ్ షాక్

కామారెడ్డి నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Update: 2023-11-23 11:51 GMT

దిశ, భిక్కనూరు : కామారెడ్డి నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ నాయకులు, దోమకొండ జెడ్పీటీసీ సభ్యులు తీగల తిర్మల్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ, మధుయాష్కి గౌడ్, ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా తిర్మల్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జెడ్పీటీసీతో పాటు సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తిర్మల్ గౌడ్ స్పష్టం చేశారు. 


Similar News