విద్యుదాఘాతానికి గుర్తు తెలియని వ్యక్తి మృతి
మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రం శివారులో గల ధర్మాన్నోళ్ల నర్సయ్య వ్యవసాయ క్షేత్రం లో విద్యుత్ తీగకు తగిలి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.
దిశ, భీంగల్ : మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రం శివారులో గల ధర్మాన్నోళ్ల నర్సయ్య వ్యవసాయ క్షేత్రం లో విద్యుత్ తీగకు తగిలి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. జొన్న చేలులో కరెంట్ వైరు ఉన్నందున కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.