గాలిపటం పట్టకోపోయి...ట్రాన్స్ఫార్మపై పడిన యువకుడు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సోమవారం సంక్రాంతి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది.
దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సోమవారం సంక్రాంతి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. బాన్సువాడ పట్టణంలో తెగిన గాలిపటాన్ని పట్టుకుంటున్న క్రమంలో కరణ్ సింగ్ (21) అనే యువకుడు ట్రాన్స్ఫార్మపై పడిపోయాడు. దాంతో విద్యుత్ షాక్ కు గురై శరీరం తీవ్రంగా కాలిపోయింది.
దీంతో గమనించిన స్థానికులు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి బాధితుడిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్బంగా అస్పత్రి వైద్యురాలు డా. వినతి మాట్లాడుతూ కరణ్ సింగ్ కు ఛాతి భాగంలో, కుడి కాలు, కుడి చేయికి తీవ్రంగా గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.