భర్తకు వాతలు పెట్టిన భార్య..

చేసేది మోటు పని (కూలి పని) సాయంత్రమైందంటే ఫుల్లుగా మద్యం తాగి వస్తున్నాడని భార్య భర్తకు వాతలు పెట్టింది. కర్రు కాల్చి కాళ్లు, చెతులు, ముఖం పై పెట్టిన వాతలతో బెంబేలేత్తిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Update: 2024-06-27 17:38 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : చేసేది మోటు పని (కూలి పని) సాయంత్రమైందంటే ఫుల్లుగా మద్యం తాగి వస్తున్నాడని భార్య భర్తకు వాతలు పెట్టింది. కర్రు కాల్చి కాళ్లు, చెతులు, ముఖం పై పెట్టిన వాతలతో బెంబేలేత్తిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ గ్రామానికి చెందిన మహేష్ కి గత కొన్నేళ్ల క్రితం మంచిప్ప తాండాకు చెందిన సుమలత కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం.. అయితే మహేష్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం కూలి పనిచేసి అలసిపోయి మద్యం సేవించి ఆపై, కల్లు సేవించి నిద్ర నిద్రపోయినట్టు బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలో మహేష్ భార్య సుమలత అర్ధరాత్రి నిద్రపోయిన తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి ఓ ఇనుప బొంగును కాల్చి శరీరం మూతి పై చెంపల పై అలాగే కాళ్ల పై, చేతులపై ఎక్కడపడితే అక్కడ సురుకులు పెట్టిందని బాధితుడు వాపోయాడు.

నిద్రలో నుంచి మెలకువ వచ్చి ఒక్కసారిగా మంటలను తట్టుకోలేక కేకలు వేస్తూ బయటకు పరుగెత్తగా మహేష్ భార్య పిల్లల్ని తీసుకుని పారిపోయిందని బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చూపించుకొని స్థానికులు వారి కుటుంబ సభ్యులు వెంటనే ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. నాలుగు రోజులుగా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పిలిపించి మాట్లాడుతామని దాటవేస్తున్నారని బాధితుడు వాపోయాడు.. నేను చేసేది కూలీ నాలితో వచ్చిన డబ్బుల నుండి కొంత తీసుకొని మద్యం తీసుకుంటానని మిగిలిన డబ్బులు తన భార్యకే ఇచ్చేవాడినని బాధితుడు తెలిపాడు.. అయినా కూడా పడుకున్న తనను గత నాలుగు రోజుల క్రితం ఇంత దారుణంగా కట్టేసి మరి సురుకులు పెట్టి పారిపోవడం ఏంటని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.


Similar News