భర్తకు తలకొరివి పెట్టిన భార్య

కలకాలం తోడుంటానని అగ్ని సాక్షిగా మనువాడి వ్యక్తి శాశ్వతంగా తనను ఒంటిరిని చేసి వెళ్లిపోయాడు.

Update: 2024-10-24 16:14 GMT

దిశ, మాచారెడ్డి: కలకాలం తోడుంటానని అగ్ని సాక్షిగా మనువాడి వ్యక్తి శాశ్వతంగా తనను ఒంటిరిని చేసి వెళ్లిపోయాడు. నూరేళ్ల వైవాహిక జీవితం కాస్తా అడవి కాసిన వెన్నలగా మారింది. కట్టుకున్న వాడి రుణం తీర్చుకోవడానికి తాను ఏ ఆడది చేయని గొప్ప పని చేసింది. తన జీవితం కన్నీటి సంద్రంగా మారినప్పటికి భర్త అంతిమ సంస్కారాలు, అంత్యక్రియల ను తానే దగ్గరుండి నిర్వహించి .. భార్యకు కొత్త నిర్వచనం ఇచ్చింది.కన్న పేగు బంధం లేక కట్టుకున్న వానికి తలకొరివి పెట్టిన దయనీయ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కా పూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇసాయిపేట మైసయ్య(40) అనారోగ్యం తో మృతి చెందాడు. కన్న పిల్లలు లేక పోవడంతో.. భార్య లక్ష్మి తలకొరివి పెట్టింది. ఈ దయనీయ పరిస్థితి అందరినీ కదిలించింది. ఈ ఘటన పేగు బంధం విలువను సమాజానికి చాటింది.


Similar News