సైకిలిస్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం... ఇద్దరు దుర్మరణం

రోడ్డు దాటుతున్న సైక్లిస్టును, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ హైవేపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-01-12 15:47 GMT

దిశ, భిక్కనూరు : రోడ్డు దాటుతున్న సైక్లిస్టును, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ హైవేపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన గుండా వెంకటి (46) దాబా లో పనులు ముగించుకొని సైకిల్ పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా, కామారెడ్డి నుంచి దోమకొండ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, సైకి లిస్ట్ వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు.

     తీవ్రంగా గాయపడిన ద్విచక్ర వాహనదారులను అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో దోమకొండ మండల కేంద్రానికి చెందిన నాయిని నిఖిల్ రెడ్డి(25) మృతి చెందగా, అదే మండల కేంద్రానికి చెందిన అబ్రబోయిన సుమంత్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలానికి భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలోని పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

     మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారులు నియంత్రణ లేని వేగంతో రావడం వల్లే, కంట్రోల్ కాక ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న భార్య లక్ష్మి, కుమారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.  


Similar News