మనిషి ఎదుగుదలకు ఆధ్యాత్మిక భావన అవసరం.. ఎమ్మెల్యే

మనిషి ఎదుగుదలకు ఆధ్యాత్మిక భావన ఎంతో అవసరమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.

Update: 2024-09-09 17:12 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మనిషి ఎదుగుదలకు ఆధ్యాత్మిక భావన ఎంతో అవసరమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. బోర్గాం గ్రామంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామికి చింతకాయల రాజేందర్ అనే భక్తుడు కిలోన్నర వెండితో నెమలి కిరీటాన్ని తయారు చేయించి సోమవారం స్వామివారికి సమర్పించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్వహస్తాలతో మొదట ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అర్చన, అభిషేకం జరిపించారు. మయూర కిరీటాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ స్వయంగా సుబ్రహ్మణ్య స్వామికి బహుకరించారు.

ఈ సందర్భంగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు మన సంప్రదాయాల గొప్పతనాన్ని గుర్తుచేస్తాయన్నారు. ఇది భక్తుల భక్తి, విశ్వాసం, సమర్పణకు ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. ఆలయాభివృద్ధి కేవలం భవనం మాత్రమే కాదు, భక్తుల ఆధ్యాత్మిక జీవితానికి మార్గదర్శనం కూడా అని ధన్ పాల్ అన్నారు. వెండి కిరీటం స్వామివారి పట్ల భక్తుల ప్రేమను ప్రతిబింబిస్తుందని అని పేర్కొన్నారు. స్వామి వారికి వెండి మయూరి కిరీటాన్ని తయారు చేయించి బహూకరించిన భక్తుడు రాజేందర్ ను ఎమ్మెల్యే ధన్ పాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు ఆనంద్, పవన్ ముందాడ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Similar News