నీట మునిగి గొర్రెల కాపరి మృతి

ప్రమాదవశాత్తు నీట మునిగి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన నిజాంసాగర్‌ మండలంలోని మల్లూర్‌ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

Update: 2023-11-22 15:37 GMT

దిశ,నిజాంసాగర్‌ : ప్రమాదవశాత్తు నీట మునిగి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన నిజాంసాగర్‌ మండలంలోని మల్లూర్‌ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంసాగర్‌ మండలంలోని మల్లూర్‌ గ్రామానికి చెందిన కోటగిరి రవి(44) అనే వ్యక్తి ఉదయం గొర్రెలు కాసేందుకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో గొర్రెలకు నీరు తాగించే క్రమంలో ఆయన ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఈతరాక అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుని భార్య సాలవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.


Similar News