నిబంధన ప్రకారం రైస్ మిల్లు నిర్వహించాలి

పిట్లం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులు నిబంధన ప్రకారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రైస్ యజమానులకు సూచించారు.

Update: 2024-01-10 13:29 GMT

దిశ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులు నిబంధన ప్రకారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రైస్ యజమానులకు సూచించారు. బుధవారం పిట్లం మండలంలోని మద్దెలచెరువు గ్రామంలో గల బిలాల్ రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. జనవరిలోగా ఇప్పుడున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి గోదాములకు తరలించాలని అన్నారు. రానున్న సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. మిల్లింగులలో ఎలాంటి అవకతకులకు పాల్పడ్డా సదరు రైస్ మిల్ పై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పిట్లం ఇంచార్జ్ తహసీల్దార్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News