సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి

జిల్లా విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఆ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు.

Update: 2024-02-02 10:28 GMT

దిశ, కామారెడ్డి : జిల్లా విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఆ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు పే స్కేలు అమలు చేయాలని కోరారు. గతంలో సమ్మె చేసినప్పుడు తమకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఆయనకు గుర్తు చేశారు.

    దానికి షబ్బీర్ అలీ స్పందిస్తూ మీ సమస్య తమ దృష్టిలో ఉందని, త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, సంఘం ప్రతినిధులు రాములు, చిరంజీవి, శ్రీనివాస్, సూర్య పాల్, సంజీవులు, వేణు, కాళిదాస్, మహమూద్, లింగం, సాయి రెడ్డి, నరసింహులు, బాలయ్య, సభ్యులు పాల్గొన్నారు. 


Similar News