మైనర్ బాలికతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా అరెస్ట్

కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్న తల్లిదండ్రులు లేని ఓ మైనర్ బాలికతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Update: 2024-03-22 10:53 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్న తల్లిదండ్రులు లేని ఓ మైనర్ బాలికతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు లేని ఓ బాలికను ఆమె చిన్నమ్మ వద్ద నుంచి డబ్బులకు కొనుగోలు చేసి ఆ అమ్మాయిని బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారన్నారు. సదరు బాలికను హింసిస్తూ వ్యభిచారం చేయించగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారన్నారు. భీంగల్‌కు చెందిన సంపంగి లక్ష్మి, ఆమెతో సహజీవనం చేస్తున్న సుంకరి శంకర్‌తో పాటు వీరికి సహకరిస్తూ శ్రీనివాస లాడ్జి (బస్ స్టాండ్ దగ్గర)లో వ్యభిచారం కొనసాగిస్తున్న లాడ్జి ఓనర్ నరసింహారెడ్డిలను అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. ఇకపై కామారెడ్డి పట్టణంలో వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లాడ్జీలు, హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు.


Similar News