బోధన్‌లో కత్తిపోట్ల కలకలం.. విషమంగా ఇద్దరి పరిస్థితి

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. యువకుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ కత్తి పోట్లకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు గాయాలు కాగా

Update: 2024-01-30 06:24 GMT

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. యువకుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ కత్తి పోట్లకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు గాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని నిజామాబాద్ ఆసుపత్రికి, మరొకరిని హైదరాబాద్‌కు తరలించారు. యువకుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన వారిని షోయబ్, సోహైల్, తన్వీర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై బోధన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షోయబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వాసే, ఇలియాస్‌పై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.


Similar News