మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ

ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గొలుసును తెంపుకెళ్లిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది.

Update: 2024-02-09 13:54 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గొలుసును తెంపుకెళ్లిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. నగరంలోని ఆర్మూర్ రోడ్డులోని ప్రమీల అనే మహిళ ఒక ఫంక్షన్ కు వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై వచ్చిన అగంతకులు

    ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు తెంపుకుని పరారీ అయ్యేందుకు ప్రయత్నించారు. మహిళ లాకెట్ తో పాటు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో సగ భాగం మాత్రం అగంతకులు తెంపుకెళ్లారు. ఆమె కేకలు వేసినప్పటికీ అప్పటికే అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. 


Similar News