పదవ తరగతి విద్యార్థినికి యువకుడితో పెళ్లి

పదవ తరగతి విద్యార్థినికి 24 ఏళ్ల యువకునితో తల్లిదండ్రులు వివాహం జరిపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-10-18 14:56 GMT

దిశ, కామారెడ్డి : పదవ తరగతి విద్యార్థినికి 24 ఏళ్ల యువకునితో తల్లిదండ్రులు వివాహం జరిపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామారెడ్డి మండల కేంద్రంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినికి అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకునికి తెల్లవారు జామున 3 గంటలకు తల్లిదండ్రులు వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న సిడబ్ల్యుసి అధికారులు ఈ వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక, యువకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే బాలిక గర్భవతి కావడంతోనే.. వివాహం జరిపించినట్టుగా ప్రచారం సాగుతోంది. దాంతో బాలికకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు బాలికను బాల సదనంకు తరలించినట్టుగా సమాచారం.


Similar News