ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు రేపు కీలక తీర్పు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై బుధవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

Update: 2024-06-26 13:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై బుధవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. చార్జ్ షీట్ వేయకపోవడంతోనే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని మాజీ అడిషనల్ ఎస్పీలు కోరారు. అయితే జూన్ 10వ తేదీనే చార్జ్ షీట్ దాఖలు చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే కొన్ని కారణాలతో చార్జ్ షీట్ ను వెనక్కి పంపారని వివరించారు. బెంచ్ మీద చార్జ్ షీట్ లేకపోవడంతోనే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశామని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన పలు జడ్జిమెంట్లను ఇరుపక్షాలు ప్రస్తావించాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పు వెల్లడించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News