ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మహిళ మృతి

Update: 2024-09-03 08:16 GMT

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): గుండె నొప్పి వస్తుందని ఆర్టీసీ బస్సులో ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యలో మహిళ మృతి చెందిన విషాద సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాగారం మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన జటంగి యాదమ్మ (50) ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలుపగా, వారు ఫణిగిరి వద్ద సూర్యాపేట వెళ్ళే ఆర్టీసీ బస్సు ఎక్కారు. అక్కడ నుంచి జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి వద్దకు రాగానే గుండె పోటుతో సీట్లోనే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Similar News