Collector: ధరణి పెండింగ్ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

ధరణిలో పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు

Update: 2024-09-19 15:54 GMT

దిశ, పెన్ పహాడ్ : ధరణిలో పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, రికార్డులు పరిశీలించి మాట్లాడారు. ఉద్యోగులు విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించబోమని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. మండలంలో జరుగుతున్న ఇంటింటి సర్వే వివరాలను ఇంచార్జ్ తహసిల్దార్ ధారావత్ లాలునాయకును అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో తప్పొప్పుల సవరణను మరణ ధ్రువీకరణ గుర్తించి వాటిని తొలగించేందుకు కృషి చేయాలని, మార్పులు చేర్పులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

ధరణిలో 8 పీ డి సి సమస్యలు మరో నాలుగు ఇతర సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండలంలోని ఓటరు జాబితా సవరణలో పంచాయతీ కార్యదర్శులు వచ్చిన నివేదిక ప్రకారం 166 మంది మరణించినట్లు గుర్తించామని, వాటిని తొలగించామని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.సిబ్బంది హాజరు పట్టి పరిశీలించి కార్య స్థాన వివరాలను కలెక్టర్ తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ హాజీ ఉన్నిసా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News