SI Anil Reddy : అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీల పట్టివేత..

ప్రభుత్వం అనుమతులు లేకుండా లారీలకు నంబర్ ప్లేట్లు లేకుండా ఆంధ్రా నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను చిమిర్యాల క్రాస్ రోడ్డు లో పట్టుకున్నట్లు కోదాడ గ్రామీణ ఎస్ఐ అనీల్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.

Update: 2024-08-04 16:33 GMT

దిశ, కోదాడ : ప్రభుత్వం అనుమతులు లేకుండా లారీలకు నంబర్ ప్లేట్లు లేకుండా ఆంధ్రా నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను చిమిర్యాల క్రాస్ రోడ్డు లో పట్టుకున్నట్లు కోదాడ గ్రామీణ ఎస్ఐ అనీల్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. లారీల డ్రైవర్ లు షేక్ రసూల్, తాటి కొండల్ రావు, షేక్ మహ్మద్ రఫీలతో పాటు లారీ ఓనర్ లు షేక్ ఆఫ్రోజ్, పూసపాటి సీతల పై కేసు నమోదు చేసి లారీలను సీజ్ చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను దొంగతనంగా అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News