దొంగతనం చేసిన వ్యక్తి‌ అరెస్ట్

దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని అతని నుండి రెండు మోటర్ సైకిల్ 25 వేల విలువగల పాత ఇనుప సామానును రికవరీ చేసి అతనిని రిమాండ్ కు తరలించినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ సోమవారం విలేకరులకు తెలిపారు.

Update: 2024-07-01 15:36 GMT

దిశ, నేరేడుచర్ల : దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని అతని నుండి రెండు మోటర్ సైకిల్ 25 వేల విలువగల పాత ఇనుప సామానును రికవరీ చేసి అతనిని రిమాండ్ కు తరలించినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ సోమవారం విలేకరులకు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . గత నెల 29న నేరేడుచర్ల లోని హుజూర్ నగర్ రోడ్ లో పాత ఇనుము షాప్ లో దొంగతనం చేసిన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కు చెందిన తాళ్లూరి కనకాచారి (34) నిందితులుగా గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుని నుంచి రెండు మోటార్ సైకిళ్ళు 25 వేల విలువగల పాత ఇనుప సామానును రికవరీ చేసి అతని అరెస్టు చేసి రిమాండ్ తరలించి కోర్టు ముందు హాజరు పరిచినట్లు తెలిపారు. నిందితునిపై గతంలో హైదరాబాద్ పట్టణంలోని సరూర్ నగర్, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు.

Similar News