అందుబాటులో లేకుంటే కఠిన చర్యలుః డీఎంహెచ్ వో శ్రీనివాస్

Update: 2024-08-26 15:42 GMT

దిశ, చింతపల్లిః చింతపల్లి మండల పరిధిలోని వీటి నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం అకస్మాత్తుగా నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పుట్ల శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఆస్పత్రిని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల దృష్టి ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఔషధాల కొరత లేకుండా వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. డెంగ్యూ కేసుల గురించి వాకబు చేసి, విష జ్వరాలతో మరణాల గురించి వాకబు చేసి, కేసు వివరాలను పరిశీలించి, రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.


Similar News