డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. వ్యక్తి మృతి

Update: 2024-08-25 13:41 GMT

దిశ, వేములపల్లి : ఆగి ఉన్న డీసీఎంను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున మండలంలోని శెట్టిపాలెం రైస్ మిల్లుల సమీపంలో చోటుచేస్తుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మార్నింగ్ స్టార్ ప్రైవేట్ బస్సు శనివారం రాత్రి 27 మంది ప్రయాణికులతో బాపట్ల నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. కాగా మండలంలోని మహర్షి రైస్ మిల్లు సమీపంలో రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన డీసీఎంను వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలో కూర్చున్న బస్సు క్లీనర్ దావాల దావీద్ (40) కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కాగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు కాగా వెంటనే ప్రథమ చికిత్స అందించి వేరొక బస్సులో గమ్యస్థానానికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడు భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు చిలకలూరిపేట వైయస్సార్ కాలనీకి చెందిన వాడు కాగా మృతునికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. 


Similar News