మంత్రాల నెపంతో..తల్లిదండ్రులను వెళ్లగొట్టిన కొడుకు

చేతబడి చేస్తున్నారనే నెపంతో తల్లితండ్రులను కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టిన ఘటన ఆత్మకూర్ ఎస్ మండలం కందగట్ల గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-23 10:21 GMT

దిశ సూర్యాపేట టౌన్: చేతబడి చేస్తున్నారనే నెపంతో తల్లితండ్రులను కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టిన ఘటన ఆత్మకూర్ ఎస్ మండలం కందగట్ల గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రoలోని ఆర్డీవో కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. అర్రూరు నరసయ్య, భార్య అర్రూరు అనసూర్య, కందగట్ల గ్రామంలో వేరే నివాసం ఉంటున్నప్పటికీ ఇంటిలో ఉండొద్దని గత రాత్రి గృహ నిర్బంధం చేసి భౌతికంగా కొట్టి మంగళవారం రాత్రి వెళ్లగొటారని వృద్ద దంపతులు వాపోయారు. తనకు ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కూడా కుమారుడే సేద్యం చేసుకుంటున్నాడని, గత మూడేళ్ల నుంచి తిండి పెడతలేరని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దమనుషుల సమక్షంలో సీజన్ కి ఐదు వేల రూపాయలు, పుట్టెడు వడ్లు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇవ్వడం లేదని వాపోయారు. అలాగే భౌతికంగా మానసికంగా క్షోభకు గురి చేస్తున్న కుమారుడు, కోడలపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వేణుమాధవ్ కు వినతిపత్రం అందజేశారు.


Similar News