చెట్టుకు ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి..
రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన చెవిటి ప్రభాకర్ (35) ఆదివారం రాత్రి బైక్ పై వెళ్తూ చెట్టుకు ఢీకొని మృతి చెందాడు.

దిశ, రాజపేట : రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన చెవిటి ప్రభాకర్ (35) ఆదివారం రాత్రి బైక్ పై వెళ్తూ చెట్టుకు ఢీకొని మృతి చెందాడు. గ్రామం నుండి సమీప దేవాలయానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. తలకు బలమైన గాయం తగలడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పెయింటింగ్ పని చేసుకుని జీవిస్తున్నట్లు గ్రామస్తులు చెప్పారు.