'న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి'

Update: 2023-09-30 12:35 GMT

దిశ, మర్రిగూడ: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడి, ఆశాలు సమ్మె చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తహాశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు, ఆశాలు చేస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న అంగన్వాడీలు, ఆయాల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధింపులకు పోకుండా వెంటనే వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ రామ్ రెడ్డి, ఎంపీటీసీ వెన్నమనేని శోభ, రవీందర్రావు, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, ఎలిమినేటి సత్తిరెడ్డి, జమ్ముల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News