తీవ్ర మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య

యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-09 02:28 GMT

దిశ, నిడమనూరు: యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిడమనూరుకు చెందిన పాల్వయి మట్టయ్య, సుగుణమ్మ దంపతుల రెండో కుమారుడు శ్రీకాంత్ (35) డి ఆర్ డి ఏ(DRDA) ఉద్యానవన విభాగంలో ఔట్ సోర్సింగ్‌లో అడ్మిన్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన బుర్రి రమేష్, సూర్యాపేట‌కు చెందిన రాజారమేష్‌కు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం శ్రీకాంత్‌ను మధ్యవర్తి‌గా పెట్టి 3 లక్షలు ఇచ్చాడు. గత మూడు సంవత్సరాల నుండి ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు తీసుకున్న రాజా రమేష్ వద్దకు బుర్రి రమేష్‌ శ్రీకాంత్‌ను తీసుకెళ్లి ప్రాంసరి నోటు రాయించి ఇచ్చాడు. అయినా బుర్రి రమేష్, అతని సోదరుడు నవీన్.. శ్రీకాంత్‌ను డబ్బులు తిరిగి ఇవ్వాలని గొడవ పెట్టుకుని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీకాంత్ మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక విషయం తెలుసుకున్న హాలియా సి ఐ జనార్ధన్ గౌడ్, ఎస్ ఐ గోపాల్ రావులు ఘటన స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ గోపాల్ రావు తెలిపారు.


Similar News