ఫ్లాష్.. ఫ్లాష్: కరీంనగర్ జిల్లాలో దారుణం.. తమ్ముడిని కడతేర్చిన అన్న
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పరిధిలోని దుద్దెనపల్లి గ్రామంలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది.
దిశ, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పరిధిలోని దుద్దెనపల్లి గ్రామంలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దుద్దెనపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల చంద్రు (24) అనే యువకుడిని అతడి అన్న కుందేళ్ల కుమార స్వామి ఇనుపరాడ్తో తలపై బలంగా కొట్టి హతమార్చినట్లుగా తెలిపారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.