మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.

Update: 2024-10-08 10:40 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లి గ్రామంలోని చేపల చెరువులో 30 వేల చేప పిల్లలను జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జండగే తో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదలడంతో మత్స్యకారులు, ముదిరాజులు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందని అన్నారు.

    మత్స్యకారులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. చెరువులలో సమృద్ధిగా నీరు ఉన్నందున చేప పిల్లలు పెంచడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నుంచి నీళ్లు విడుదల కావడంతో మత్స్యకారులు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని అన్నారు. మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లడానికి జిల్లాలో కొత్త మహిళా సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారామ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు సంజయ్, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు కృష్ణ, ఝాన్సీ రవిశంకర్, సతీష్, శంకరయ్య, కుమార్, నరసింహ, మత్స్యకారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News